కట్నం కింద కిడ్నీ ఇవ్వాలని కోడలిని వేధించారు అత్తమామలు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ లో ముజఫర్ పుర్ జిల్లా బోచహాన్ గ్రామానికి చెందిన యువకుడికి దీప్తి అనే యువతితో 2021లో వివాహం జరిగింది. మొదట్లో అత్తామామలు బాగానే ఉన్నా తర్వాత అదనపు కట్నంగా నగదు, బైకు తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో ఆమె భర్త కిడ్నీ ల్లో ఒకటి పాడైంది.దీంతో అదనపు కట్నం గా కనీసం ఒక కిడ్నీని భర్తకు ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచారు. కి డ్నీ ఇచ్చేందుకు ఆమె నిరాకరిస్తోందంటూ భర్త, అత్తామామలు చావబాది ఇంటి నుంచి గెంటేశారు. పుట్టింటికి వెళ్ళిన దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, భర్త అత్తామామలు సహా మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.