BREAKING : గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురి మృతి

-

అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. రాయచోటి మండలం కొత్తపేటలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, వృద్ధురాలు ఉన్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై ఆరా తీస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘కొత్తపేటలో గ్యాస్ సిలిండర్ పేలిన శబ్ధం వినిపించినట్లు స్థానికులు మాకు ఫోన్ చేశారు. వెంటనే మేం అగ్నిమాపక సిబ్బందిని వెంటబెట్టుకుని ఘటనాస్థలికి చేరుకున్నాం. మంటలు ఆర్పివేశాం. ఆ తర్వాత ఘటనాస్థలిని పరిశీలించగా ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించాం. ముగ్గురి మృతదేహాలు పూర్తిగా కాలి కనిపించాయి. అయితే వాటి పరిమాణాన్ని బట్టి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుల్లో ఇద్దరు చిన్నారులు, వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించాం. అయితే ఈ ఘటన వారు నిద్రలో ఉండగానే చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాం. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నాం. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నాం. మృతుల బంధువులకు సమాచారం అందించాం.’ అని స్థానిక పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version