తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్ లో వేచి ఉన్నారు తిరుమల భక్తులు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 16-18 గంటల సమయం పడుతుంది. 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 87,536 గా నమోదు ఐంది. 35,120 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.33 కోట్లుగా నమోదు అయింది.