నేడు ఏపీ సీఎం జగన్ బర్త్ డే..రూ.రూ. 2.50 కోట్లతో సెలబ్రేషన్లు !

-

అమరావతి: నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ 50వ జన్మదినం. అయితే, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు. దీనిలో భాగంగా ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటనుండగా, రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహించనుంది.

అటు వైసీపీ అభిమానులు, నేతలు జగన్ వీడియోలను పోస్ట్ చేస్తూ ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలకు మాత్రం రూ. 2.50 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. ఒకవైపు నాటక పరిషత్తులు, కళాకారులకు రూ.4 కోట్ల బకాయిలు చాన్నాళ్లుగా ఇవ్వడం లేదు. వారు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు జన్మదిన వేడుకల కోసం మాత్రం భారీగా ఖర్చుపెట్టి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version