Tirumala : నేడు నాల్గో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నేడు నాల్గో రోజు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు, అర్చకులు.

Today is the fourth day of Srivari’s annual Brahmotsavam

అటు రేపు శ్రీవారి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. మాడవీధులలోని గ్యాలరిల ద్వారా 2 లక్షల మంది భక్తులు వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి స్వామివారి వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు చేసారు అధికారులు. మాడవీధులలోని 5 ప్రాంతాల వద్ద వాహనం వద్దకు భక్తులును అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లులో ద్విచక్రవాహనాల నిలిపివేయనున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version