శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి అక్కడ కూడా టికెట్ కౌంటర్

-

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. చాలా మంది కాలి నడక ద్వారా ఏడు కొండలు ఎక్కి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తుల రాకతో తిరుమలలో రద్దీ నెలకొంటుంది. ఈ క్రమంలోనే శ్రీవాణి ట్రస్టు భక్తుల సౌకర్యార్థం టికెట్ల జారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. డీఎఫ్వో కార్యాలయంలో శాశ్వాత ప్రాతిపదికన టికెట్ల జారీ కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఈవో ఆదేశించారు.

ఇటీవల కొండపైన భక్తుల రద్దీని తగ్గించేందుకు టీటీడీ కొన్ని చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీవారి దర్శనం కోసం బుక్ చేసుకునే శ్రీవాణి టికెట్ల సంఖ్యను టీటీడీ తగ్గించింది. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఉన్న సంఖ్యలోనే టికెట్‌లను అందుబాటులో ఉంచగా.. ఆఫ్‌లైన్‌లో మాత్రం శ్రీవాణి టికెట్ల జారీ సంఖ్యను వెయ్యికి(1000) తగ్గించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version