ఇవాళ శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

-

ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల కానున్నాయి. జులైకు సంబంధించిన సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల లక్కీ డిప్‌కు అవకాశం ఉంది. ఈనెల 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్‌ నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈనెల 22వ తేదీన వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. వర్చువల్ సేవా టికెట్లతో పాటు వాటి దర్శన స్లాట్ కూడా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ‘మరోవైపు ఈ నెల 23వ తేదీన శ్రీవారి అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు టోకెన్లు విడుదల చేయనున్నాం. 23న వయోవృద్ధులు, దివ్యాంగుల టోకెన్లు, ఈనెల 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తాం. https://ttdevasthanams.ap.gov.inలో టోకెన్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంది’ అని టీటీడీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version