వాగు దాటుతుండగా ఇద్దరు టీచర్లు మృతి.. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం

-

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో వాగు దాటుతుండగా ఇద్దరూ టీచర్లు ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తాజాగా స్పందించారు. ఇద్దరి మరణం బాధ కలిగించిందని మంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందించామని ఆమె వెల్లడించారు. అదేవిధంగా రెండు కుటుంబాలలో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 

అలాగే కేంద్రం నుంచి రూ.10 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి సహాయం అడిగినా ఇవ్వమని సీఎం చంద్రబాబు చెప్పినట్టు మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. నిన్న అనకాపల్లిలో జరిగిన గిరిజన హాస్టల్ సంఘటనలో కలుషిత ఆహారం తిని ముగ్గురు మరణించారు. గుర్తింపు లేని హాస్టళ్లు నడిపే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని తెలిపారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version