వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి ఏరియల్ సర్వే

-

ఆంధ్రప్రదేశ్ లో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు గురువారం గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్ మెంట్ ఏరియాలను చౌహాన్ పరిశీలించారు.

ఆ తర్వాత అక్కడి నుండి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా కేంద్రమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రి కి వివరించారు మంత్రి నారా లోకేష్. ఇక ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్ కి చేరుకున్నారు.

అక్కడినుండి రోడ్డు మార్గాన వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించనున్నారు చౌహన్. ఆ తరువాత విజయవాడ కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకొని వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని వీక్షిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version