Janasena : 10వ తేదీ నుంచి విశాఖలో వారాహి విజయ యాత్ర

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో వైసీపీ అక్రమాలు వెలుగులోకి తెచ్చేలా వారాహి యాత్రను నిర్వహించాలని డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగానే..ఈ నెల 10వ తేదీ నుంచి విశాఖలో వారాహి విజయ యాత్ర నిర్వహించనున్నారు పవన్‌ కళ్యాణ్‌.

ఈ సందర్భంగా విశాఖ జిల్లా నాయకులు, వారాహి యాత్ర కమిటీలతో సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైసీపీ పాలనతో విశాఖలో విధ్వంసం అన్నారు. మూడో విడత యాత్ర పూర్తయ్యేలోపు భూకబ్జాలు ఆగాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వనరుల దోపిడీని నిలువరిద్దామని.. వారాహి యాత్ర గురించి దేశం మొత్తం చెప్పుకోవాలని తెలిపారు. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేలా చేద్దామని.. పంచాయితీరాజ్ వ్యవస్థను చంపేందుకే వాలంటీర్ వ్యవస్థ అంటూ ఫైర్ అయ్యారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news