ఆయన తిరుమల వెళ్తే దేవాలయం అపవిత్రం అవుతుంది : వర్ల రామయ్య

-

ఐదేళ్ళపాటు సీఎం గా పని చేసిన జగన్… ఎమ్మెల్యే గా మాత్రమే మిగిలిపోయాడు. ఇంతటి పరాభవం జరుగుతుందని జగన్ ఊహించి ఉండరు. మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ నానా గడ్డి కరుస్తున్నాడు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. అలాగే లడ్డులో కల్తీ జరింగిందని సాక్ష్యాలు ఉన్నాయి. దాన్ని కూడా జగన్ తన రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నాడు. ఏ విచారణ కైనా సిద్దమని జగన్ అంటున్నాడు. ఏ విచారణ జరపవద్దని వైవి సుబ్బారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.

జగన్ తిరుమల వెళ్తే దేవాలయం అపవిత్రం అవుతుంది. జగన్ హైందవుడా, క్రైస్తవుడా అన్న చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్, చంద్రబాబు టీటీడీ పవిత్రతని కాపాడారు. జగన్ టీటీడీ ని అపవిత్రం చేశారు. అసాంఘిక శక్తుల అడ్డాగా జగన్ పాలనలో టీటీడీ మారింది. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు వివాహం క్రైస్తవ సాంప్రదాయంలో చేశారు. జగన్ తిరుమల వెళ్తే ఇబ్బంది కరపరిస్థితులు వస్తాయి. జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్ళాలి. రెండు మతాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా జగన్ ప్రయత్నిస్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్ తో ఉంటారన్న నమ్మకం లేదు అని వర్ల రామయ్య తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version