చంద్రబాబు, పురంధేశ్వరి ఉన్న జూబ్లీహిల్స్ లో BRS గెలిచింది – విజయసాయి

-

BRS పార్టీపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పురంధేశ్వరి గార్ల నివాసాలున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS అభ్యర్థి గెలిచాడని చురకలు అంటించారు. వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకునే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలను కూడా BRS దక్కించుకుందని పేర్కొన్నారు. మరి కాంగ్రెస్, బిజేపీలకు వీళ్ల వల్ల ఒరిగింది ఏమిటి ? అని ప్రశ్నించారు.

 

ఎన్నికలు ఎంతో దూరం లేవు. మీరు పోటీ చేస్తారా? చేయరా? చేస్తే ఏ నియోజకవర్గమో చెప్పగలరా పురంధేశ్వరి గారూ అని నిలదీశారు. జవాబు లేదు కదా….టీడీపీతో పొత్తు కుదిరితే మీ బావ గారు విడిచిపెట్టే ఏదో ఒక స్థానంలో మీరు పోటీచేస్తుండొచ్చు అన్నారు. కానీ…..తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇచ్చిన చంద్రబాబు గారు కలిసి పోటీ చేద్దామన్నా మీ బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటుందా? చిన్నమ్మా….చెప్పమ్మా! అంటూ ఫైర్ అయ్యారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే. తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచిందని గాంధీభవన్ ముందు పచ్చ జెండాలతో టీడీపీ ఉబలాటం ప్రదర్శించిందని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version