బీజేపీలో టీడీపీ విలీనమే..బై.. బై బాబు – విజయసాయి సంచలనం

-

బీజేపీలో టీడీపీ విలీనం కాబోతుందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోందా? అని ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీలో ప్రభుత్వంలో సర్వం తానే చక్రవర్తి అన్నట్టు నారా లోకేష్ వ్యవహార శైలితో సీనియర్లు, సన్నిహితులు సహా విసిగిపోతున్నారా? అని ప్రశ్నించారు. మొన్న బాగున్న పార్టీ, అధికారంలోకి వచ్చిన 100 రోజులకే అనామకంగా అవ్వబోతోందా? అని ఆగ్రహించారు.

vijayasai reddy on chandrababu over jamili

జనం 135 స్థానాలు ఇచ్చి నీరాజనాలు పలికితే వంద రోజుల్లో పార్టీలో కుంపట్లతో అసంతృప్తులా! ఎందుకని ? మొన్న మస్తాన్ రావు, మోపిదేవి, నిన్న బాలినేని, సామినేని ….లిస్ట్ ఇంకా ఉందా! ఇంకెంతమందిని అవినీతి సొమ్ముతో కొంటారు ? అని నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధికి నోచుకోక, సంక్షేమపథకాలు అమలులో వైఫల్యంతో ఇక జమిలి ఎన్నికల తర్వాత టీడీపీ జెండా పీకేయ్యడమేనా? అంటూ సెటైర్లు పేల్చారు సాయిరెడ్డి. టీడీపీ బీజేపీ లోకి విలీనమౌతుందా?
బై.. బై బాబు…బై..బై బాబు అంటూ ఎద్దేవా చేశారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version