ఆధార్ కార్డు పై లడ్డు ప్రసాదాల జారి ప్రారంభించాం : ఈఓ శ్యామలరావు

-

తిరుమల లడ్డు ప్రసాదాలను భక్తులకు పారదర్శకంగా అందించేందుకు దర్శనం చేసుకోని భక్తులకు ఆధార్ కార్డు పై లడ్డు ప్రసాదాల జారి ప్రారంభించామని తెలిపారు ఈఓ శ్యామలరావు. దర్శనానికి వెళ్ళిన భక్తులుకు కోరినన్ని లడ్డులు అందజేస్తామని తెలిపారు. న్యాణమైన నెయ్యి కోనుగోలు కోసం టెండర్ నిబంధనలతో మార్పు తీసుకువచ్చామని వెల్లడించారు. నెయ్యి నాణ్యత పరిశీలనకు నేషనల్ డైరి బోర్డు టీటీడీ కి 80 లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలను విరాళంగా అందిస్తున్నారు.

అలిపిరి నడక మార్గంలో భక్తులకు టోకేన్లు జారి పున:రుద్దరణ చేస్తామని వివరించారు. సర్వదర్శనం భక్తులుకు వారానికి 1.63 లక్షల టోకేన్లు జారి చేస్తున్నాం. అన్న, ప్రసాదాల తయారిలో వినియోగిస్తున్న సేంద్రియ వ్యవసాయ పదార్దాల వినియోగం పై కమిటిని నియమించాం. టీటీడీ లో ఆధార్ వినియోగం పై కేంద్రం నుంచి అనుమతులు లభించాయి. త్వరలోనే నోటిఫికేషన్ వెలుపడుతుంది.
తిరుమల, టీటీడీలో ఏఇ పోస్టుల నియామకానికి సంభంధించిన ప్రకియ బ్రహ్మోత్సవాలు తరువాత ప్రారంభిస్తామని ఈఓ శ్యామలరావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version