అబద్ధపు హామీలకు మోసపోయి టీడీపీని గెలిపించారు..!

-

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కాదు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలకు మోసపోయి టీడీపీని గెలిపించారు. కానీ మూడు నెలల్లోనే వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కూటమికి దక్కుతుంది అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కుంటిసాకులు చెప్పడం విడ్డూరం. ఎకానమిక్స్ సబ్జెక్టులో ఎంఏ చేసిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండదా అని ప్రశ్నించిన సతీష్.. పదవిపై వ్యామోహంతో అబద్ధపు వాగ్దానాలు చేశాడు అని పేర్కొన్నారు.

చంద్రబాబుకు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ప్రజల తరపున పోరాడుతాం. ఇచ్చిన హామీలు అమలు కాని పక్షంలో ప్రజల మధ్యలో చంద్రబాబును దోషిగా నిలబెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు ధన సంపాదన, అక్రమార్జన ద్యేయంగా వ్యవహరిస్తున్నారు.. అధికారం ఇచ్చింది దోచుకోవడం కోసమే అన్నట్లు అధికార పార్టీ నాయకులు వ్యవ్యరిస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలని ఆలోచన టీడీపీ నాయకులకు పట్టడం లేదు అని సతీష్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version