రాజకీయం చేయాలంటే పక్కన 10 మంది పోరంబోకులు ఉండాలి : వైసీపీ ఎమ్మెల్యే

-

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే, 10 మంది పోరంబోకులు వెంట ఉండాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు వైసీ పీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. అప్పటి రాజకీయాలకు.. ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందని.. ఇప్పటి రాజకీయాల్లో పోరంబోకులు ఉండాలన్నారు.

అయితే, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియాల్సి ఉంది. కాగా… కాగా నిన్న ఎంపీ కేశినేని నానిని కలిశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరావు. ఇప్పటికే పలు అంశాల్లో వైసీపీతో విభేదిస్తున్న వసంత నాగేశ్వరావు… అమరావతి రాజధాని, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తన అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్…ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version