‘సిద్ధం’ స్లోగన్ తో వైసీపీ ఎన్నికలకు రెడీ..పోస్టర్ రిలీజ్

-

సిద్ధామా…? జగనన్నకు మద్దతుగా నిలుద్దాం రండి…అంటూ వైసీపీ పార్టీ కీలక ప్రకటన చేసింది. పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకునేందుకు జెండాలు జతకట్టే టీడీపీ, జనసేన పెత్తందారులపై పోరాడేందుకు నేను సిద్ధం అంటూ జగన్‌ మోహన్‌ రెడ్డి పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. మీరు సిద్ధమా…? ఈ లింక్ క్లిక్ చేసి మీ పేరు నమోదు చేసుకొండి, మీ పేరుతో ఉన్న పోస్టర్ ని డౌన్లోడ్ చేసుకుని, అక్కడ ఉన్న టెక్ట్ ని కాపీ చేసుకుని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండని పేర్కొంది వైసీపీ పార్టీ.

YCP Siddham poster out

ఇది ఇలా ఉండగా, ‘సిద్ధం’ స్లోగన్ తో వైసీపీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇవాళ తొలిసభను భీమిలిలో నిర్వహిస్తుండగా….సభా ప్రాంగణంలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతల కార్టూన్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘సిద్ధం వేడుక వద్ద పెత్తందారులు. జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పెత్తందారులపై యుద్ధానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా?’ అని ఆ ఫ్లెక్సీలను వైసీపీ ట్వీట్ చేసింది. వీటిని ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news