వైసీపీ ప్రజా జీవనాన్ని మార్చడానికి ప్రయత్నించింది : చెల్లుబోయిన వేణు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.14లక్షలు కోట్ల అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ తెలిపారు. శాసన సభలో 6 లక్షల 40వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. అప్పుల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అధికారం కోసం అబద్ధాలు ఎంచుకున్న నాయకుడు చంద్రబాబు.. ఫీజు రీయంబర్స్ మెంట్ చేస్తానని విద్యార్థులను మభ్య పెడుతున్నారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష 30వేల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రానికి అప్పులు పుట్టవని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇన్ని అప్పులు ఎలా చేశారు. ఈ విషయాలను ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెల్లుబోయిన వేణు చెప్పుకొచ్చారు. ప్రజా జీవనాన్ని మార్చడానికి ప్రయత్నించింది వైసీపీ అని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ పెట్టిన పథకాలకు పేర్లు మార్చుతున్నారు. జగన్ సీఎం గా ప్రచారం తక్కువ పని ఎక్కువ చేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news