Ap: సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి సముద్రంలో కొట్టుకుపోయిన యువతులు!

-

సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి సముద్రంలో యువతులు కొట్టుకుపోయారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతైన ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Young women who slipped and washed away in the sea while taking a selfie

వీకెండ్ కావడంతో సరదాగా బీచ్ వద్దకు వెళ్లినవారికి ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులలో తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. బీచ్ లో వారు సరదాగా సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో గల్లంతు అయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న మత్స్యకారులు కాపాడడానికి ప్రయత్నం చేసినప్పటికే ఇద్దరు యువతులు మృతి చెందారు. మృతిచెందిన ఇద్దరు యువతులు మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూక రత్నం, కనకదుర్గ అక్కా చెల్లెలుగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news