ఏపీలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తా – వైఎస్ షర్మిల

-

ఏపీలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. కొవ్వూరులో రాజన్న రచ్చబండలో వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగిపోయాయి. బెదిరిస్తున్నారు..హత్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. సాక్ష్యాత్తు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోమ్ మంత్రి దళితురాలై ఉండి కూడా దళితులపై దాడులను ఆపలేకపోతున్నారని నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల.

ఇంకా ఆ పదవిలో ఉండి ఏం ఉపయోగం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే దళితులకు రక్షణ. యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, మహిళలకు స్వయం సంమృద్ది, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా..రాజధాని నిర్మించుకోవాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కాంగ్రెస్ రావాలన్నారు. అందుకే చెబుతున్నా..ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ..ఇందిరమ్మ రాజ్యం, రాజన్న సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు వైఎస్‌ షర్మిల.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version