DSC పరీక్షలను వాయిదా వేయండి – YS షర్మిల

-

DSC పరీక్షలను వాయిదా వేయండి..అని కోరారు వైఎస్ షర్మిల. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ కు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదని వెల్లడించారు. నోటిఫికేషన్, పరీక్షకు మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారు.

ys sharmila about 10th class counting and nara lokesh
ys sharmila about 10th class counting and nara lokesh

లేఖలు మీద లేఖలు రాస్తున్నా కూటమి ప్రభుత్వం నియంతలా వ్యవహరించడం బాధాకరం అని పేర్కొన్నారు. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదివి అర్థం చేసుకోగలరని చెప్పారు. అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో పరీక్ష ఉంటే బాగుంటుందని అభ్యర్థుల వాదన అన్నారు షర్మిల. దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నామన్నారు.

DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నామన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news