చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తుడాలో అవినీతిపై చెవిరెడ్డి భాస్కరరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పై ముసురుకున్న అవినీతి ఆరోపణలపై విచారణలో భాగంగా ఆ సంస్థ మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు పలువురు అధికారులకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇక అటు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు ఐంది. నిన్న గుంటూరులో పోలీసులతో అంబటి రాం బాబు గొడవపడ్డారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. కేసులకు నేను భయపడాలా..? అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో అంబటి పోస్ట్ పెట్టారు.