ఎసెన్షియా కంపెనీని సీజ్ చేయాలి..!

-

అచ్యుతాపురం ఎసెన్షియా ఘటన పై Apcc చీఫ్ వైఎస్ షర్మిలా స్పందించారు. కేవలం లాభాల కోసం మాత్రమే నడిచే వ్యాపారాలతో కలిసిపోయి జనాల బతుకులను ప్రభుత్వాలు బుగ్గిపాలు చేస్తున్నాయి అని వైఎస్ షర్మిలా పేర్కొన్నారు. గత ఏడాడి చివరిలోనే ‘ఎసెన్షియా ఫార్మా’ నిర్వాహకాలను ఓ రిపోర్టు బయట పెట్టిందని, ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. కానీ అప్పటి సర్కారు, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుండి ఏమి నేర్చుకోకుండా, ఎదురు ఈ రిపోర్టుపై మౌనం వహించింది.

ఇప్పుడు కూటమి సర్కారును మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎసెన్షియా కంపెనీని సీజ్ చేసి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దారుణాలు, మరీ ముఖ్యంగా విశాఖ పరిసరాల్లో మరోసారి జరగకుండా ఆకస్మిక తనిఖీల ద్వారా నియంత్రణకు పూనుకోవాలి. ఎక్కడ భద్రతా పట్ల నిర్లక్ష్యం కనిపించినా వెంటనే ఆ ప్లాంట్లు మూసివేయాలి అని సీఎం చంద్రబాబుకు సూచించారు వైఎస్ షర్మిలా.

Read more RELATED
Recommended to you

Exit mobile version