14 ఏళ్ళల్లో చంద్రబాబు 6 లక్షల కోట్ల దోపిడీ చేశాడు – నందిగం సురేష్

-

14 ఏళ్ళల్లో చంద్రబాబు 6 లక్షల కోట్ల దోపిడీ చేశాడని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఫైర్‌ అయ్యారు. విజయవాడ లో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ… చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం చేసి 300 కోట్లు తిన్నాడని వెల్లడించారు. 14 ఏళ్ళల్లో 6 లక్షల కోట్ల దోపిడీ చేశాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్.

YSRCP MP Nandigam Suresh comments on Chandrababu Naidu

2014లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి 10 హామీలు కూడా నెరవేర్చ లేదని వివరించారు. 2024లో జగన్ ముఖ్యమంత్రి అయితే వచ్చే 20 ఏళ్ళు జగనే సీఎం గా కొనసాగుతారని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. జగన్ ను గెలిపించుకోవల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. అణగారిన కులాలను కించ పరిచిన చంద్రబాబును ఎవరైనా మళ్ళీ గెలిపించాలి అనుకుంటారా?? అని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version