తిరుమల ప్రసాదంలో జంతువుల నూనె…వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ !

-

yv subbareddy: తిరుమల ప్రసాదంలో జంతువుల నూనెను వైసీపీ సర్కార్‌ కలిపిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడని ఆగ్రహించారు వైవీ.

yv subbareddy

తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం అంటూ మండిపడ్డారు. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరని తెలిపారు. రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపితం అయ్యిందని తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version