బ్రేకింగ్: జేసీ బ్రదర్ పై మరో కేసు

-

అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ని పోలీసులు మరోసారి విచారిస్తున్నారు. సంతకాలు పెట్టడానికి గానూ స్టేషన్ కి వెళ్ళగా సంతకాలు పెట్టడం పూర్తి అయినా స్టేషన్ నుంచి బయటకు పోలీసులు పంపించడం లేదని తెలుస్తుంది. అనారోగ్యంతో ఉన్నా పంపించండంటూ పోలీసుల దృష్టి కి తీసుకువెళ్లిన ప్రభాకర్ రెడ్డిని ఇంకా జైలులోనే ఉంచారు అధికారులు.

విచారణ పేరుతో స్టేషన్లో ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి లను స్టేషన్ లోనే ఉంచారు అధికారులు. నిన్న కడప సబ్ జైలు నుంచి విడుదల అయిన సందర్భంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించారు వారిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 31 మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు పోలీసులు. దీనితో అనంతపురం పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version