ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. ఆ రోగులకు అండగా కొత్త ఆలోచన..

-

ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. చిన్న పిల్లల స్కూల్స్ నుంచి వృద్ధుల వరకూ అందరికి ఏదొక విధంగా సాయాన్ని అందిస్తూ వస్తుంది.ఇప్పుడు క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడే వారిసంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.గ్రామ స్థాయి నుంచే విలేజ్, వార్డ్ క్లినిక్స్ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ కేసులను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు క్యాన్సర్ స్క్రినింగ్ పై గ్రామస్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

త్వరలోనే ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు క్లినిక్స్ తో పాటు పీహెచ్ సీ పరిదిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును అమలు చేయబోతోంది. దీని ద్వారా గ్రామస్థాయిలోనే విస్తృత స్క్రీనింగ్ ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహించనుంది. క్యాన్సర్ ను 60-70 శాతం వరకు చివరి దశలో ఉన్నప్పుడే గుర్తిస్తున్నారు.తొలిదశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. క్యాన్సర్ గుర్తింపుతో పాటు చికిత్సకు అత్యంత సమర్ధవంతమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావలని ఇటీవల సీఎం జగన్ వైద్య శాఖను ఆదేశించారు. ఏపీలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలతో పాటు మొత్తం 27 కాలేజీల్లో క్యాన్సర్ చికిత్స కోసం లైనాక్ మెషిన్లు ఏర్పాటు చేయలని సీఎం ఇప్పటికే సూచించారు. అలాగే విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు నగరాల్లో క్యాన్సర్ నివారణకు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు త్వరలోనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందనున్నాయి.

ఈ వ్యాధిని ముందే గుర్తించడంతో ముందే చికిత్సను అందిస్తే వెంటనే నయం అవుతుంది. అయితే మహిళల్లో ఎక్కువగా వచ్చే నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో 49శాతం ప్రైమరీ స్టేజ్ లోనే గుర్తిస్తే చికిత్సకు పెద్దగా ఖర్చవదు. పైగా పూర్తిగా నయమవుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తిస్తే రూ.లక్షలోపు ఖర్చుతో 99శాతం నయమయ్యే అవకాశముంది.కాగా, మూడోదశకు చేరితే దాదాపు రెండు లక్షలు ఖర్చు చేసినా 29 శాతమే సక్సెస్ రేట్ ఉంటుంది.
ప్రస్తుతం ఏపీలో కొత్త క్యాన్సర్‌ కేసులు 70 వేల వరకు ఉండే అవకాశముంది. పురుషుల్లో నోటి క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉండగా.. మహిళల్లో బ్రెస్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్ మెంట్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా 2019-21 మధ్య చికిత్స వ్యవయం 37శాతానిక పైగా పెరిగింది.కాగా,గత ఏడాది 1.20 లక్షల క్యాన్సర్ రోగులకు వైద్యం అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version