హైద‌రాబాద్‌లో మ‌రో నిర్భ‌య‌.. క‌దులుతున్న బ‌స్సులో అత్యాచారం

-

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు వ‌చ్చినా.. మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌దులుతున్న బ‌స్సులో ఒక యువ‌తిపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న యావ‌త్ ప్రపంచాన్ని క‌న్నీళ్లు పెట్టించింది. తాజా గా అలాంటి విషాద‌క‌ర ఘ‌ట‌న‌నే తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో శ‌నివారం చోటు చేసుకుంది. క‌దులుతున్న బ‌స్సులోనే ఒక మ‌హిళ (29)పై కిరాతుకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘోరం వెలుగులోకి వ‌చ్చింది.

కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ ల‌ని ప గోదావ‌రి కి చెందిన ఒక మ‌హిళ హైద‌రాబాద్ లో ప‌ని చేస్తుంది. కాగ స్వ‌గ్రామానికి వెళ్ల‌డానికి ట్రైన్ టికెటు బుక్ చేసుకుంది. ల‌గేజీ కాస్త ఎక్కువ ఉండ‌టంతో ఒక ప్రయివేటు ట్రావెల్స్ కు చెందిన బ‌స్సును సంప్ర‌దించింది. ల‌గేజీని తీసుకురావాల‌ని డ్రైవ‌ర్ రాజేశ్ కు చెప్పింది. అయితే ల‌గేజీతో పాటు మ‌హిళ‌ను కూడా బ‌స్సులోనే ప్ర‌యాణం చేయాల‌ని డ్రైవ‌ర్ ఒత్తిడి చేశాడు. దీంతో మ‌హిళ త‌ప్ప‌ని ప‌రిస్థితిల్లో ఆ బ‌స్సులోనే ప్ర‌యాణం చేసింది.

బ‌స్సు కొంత దూరం వెళ్లిన త‌ర్వాత బ‌స్సు డ్రైవ‌ర్ రాజేశ్.. ఆ మ‌హిళ ను క‌త్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు.. కూకట్ ప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు.. నిందితుడు రాజేశ్ ను అదుపులోకి తీసుకుని విచార‌ణ చేప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version