షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ…పిటిషన్‌ను కొట్టేసిన కడప కోర్టు

-

కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ తాకింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న ..కడప కోర్టు ఆర్డర్‌ను డిస్మిస్‌ చేయాలని హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేసింది.సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు తెలిపింది.హైకోర్టు ఆదేశాల మేరకు ఇరువురి వాదనలు విన్న కడప కోర్టు…షర్మిల, సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారని షర్మిల, సునీతకు రూ.10 వేల జరిమానా కడప కోర్టు విధించింది. ఈ జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కడప కోర్టు తెలిపింది. కాగా, ఎన్నికలవేళ వైఎస్ షర్మిల, సునీత పదేపదే వైఎస్ వివేకానంద రెడ్డిని  హత్య చేసింది అవినాష్ రెడ్డి అని తరచూ ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version