జమ్మూకశ్మీర్‌లో మరోసారి టెర్రర్ అటాక్..

-

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలోని స్థానికులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. గురువారం ఉదయం జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బటాగుండ్ గ్రామంలో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో బిజ్నోర్‌కు చెందిన శుభమ్ కుమార్ చేతికి బుల్లెట్ గాయమైందని అధికారులు వెల్లడించారు.

ఇదిలాఉండగా, ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు మరణించిన ఘటన తీవ్రకలకలం రేపిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లోనే మరోసారి ఉగ్రదాడి జరగడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కాగా, ఈ వారం రోజుల్లో ఉగ్రవాదులు మూడు సార్లు కాల్పులకు తెగబడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news