ఇవాళ్టి నుంచే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

-

 

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఇవాళ్టి నుంచే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉపయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.

గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను ఖరారు చేయనుంది బీఏసీ. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఇవే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈ బడ్జెట్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈనెల 18న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. శనివారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version