ఏపీలో భారీ తగ్గిన కరోనా…ఇవాళ 1628 కేసులు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతాలకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వైరస్‌ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉంది. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కేసులు కాస్త పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1628 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,38,829 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 22 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,154 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,02,105 లక్షలకు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 2744 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 71,152 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 36, 64, 207 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version