నేడు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం

-

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్ మరోసారి వార్నింగ్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో సక్రమంగా పాల్గొనని నాయకులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా సమావేశమవనున్నారు.

ఇంటింటికీ సరిగ్గా తిరగని ఎమ్మెల్యేలకు ఈ సమావేశంలో సీఎం చివరి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని ఆయన కార్యాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గత వారమే ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్న పలువురు ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారు. మరోవైపు గత సమావేశం నాటికి అసలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించని ఎమ్మెల్యేలను జగన్‌ గట్టిగానే హెచ్చరించడంతో తర్వాత నుంచి వారు గడప గడపకూ వెళ్లడం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ మేర తిరిగారనే అంశంపై బుధవారం సమీక్షించడంతోపాటు, వారి పనితీరుపై వచ్చిన సర్వే పైనా సీఎం చర్చించనున్నట్లు తెలిసింది. 175  నియోజకవర్గాలకూ పార్టీ పర్యవేక్షకుల జాబితాను ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version