ఏపీ కరోనా అప్డేట్.. ఈరోజు ఎన్నంటే ?

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుండీ ఈ కేసులు ఎనిమిది వేలకి చేరువలో నమోదవుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,293 కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,65,856కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 57 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,663కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 65,794 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.

ap-corona

నేడు కొత్తగా 9125 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 5,94,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజూ లానే ఈరోజు కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యికి చేరువగా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో కూడా ఎనిమిది వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలానే కృష్ణాలో 6, అనంతపూర్ 2, చిత్తూరు 8, ప్రకాశం 10, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కర్నూలు 1, విజయనగరం 1, కడప 8, శ్రీకాకుళం 2, పశ్చిమ గోదావరి 4, గుంటూరు 4, నెల్లూరు ముగ్గురు కరోనా వల్ల మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version