ఏపీ కరోన అప్డేట్ 7,855 కేసులు, 52 మరణాలు

-

కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం మళ్ళీ కేసులు ఎనిమిది వేలకు దగ్గరలో నమోదయ్యాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,855 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యా రోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 654385కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 52 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5558కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 69353 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.

ap-corona

నేడు కొత్తగా 8,807 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 579474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజూ లానే ఈరోజు కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యికి చేరువగా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో కూడా ఏడు వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలానే కృష్ణాలో 5, అనంతపూర్ 6, చిత్తూరు 8, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కర్నూలు 3, కడప 3, శ్రీకాకుళం 1, పశ్చిమ గోదావరి 3, గుంటూరు 6, నెల్లూరు ఒక్కరు కరోనా వల్ల మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version