ఏపీ కరోనా అప్డేట్ : 2,745 కేసులు, 13 మరణాలు

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఉదృతి నెమ్మదిగా తగ్గుతోంది. అయితే నిన్నటి మీద కేసులు ఈ రోజు మళ్ళీ పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,745 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 835953కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 13 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6757కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21878 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ap-corona

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 807318 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 85,364 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 84,27,629 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 218, చిత్తూరులో 286, తూర్పుగోదావరి జిల్లాలో 407, గుంటూరులో 297, కడపలో 125, కృష్ణాలో 398, కర్నూలులో 38, నెల్లూరులో 130, ప్రకాశంలో 124, శ్రీకాకుళంలో 91, విశాఖపట్నంలో 120, విజయనగరంలో 83, పశ్చిమ గోదావరిలో 428 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version