ఏపీలో భారీగా తగ్గిన క‌రోనా ..కొత్త‌గా 127 కేసులు

-

ఏపీ లో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న పెరిగిన క‌రోనా కేసులు.. ఇవాళ కాస్త త‌గ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం….  ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 127 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2075546 కి పెరిగింది. కోవిడ్ వల్ల కృ ష్ణా, ప్రకాశం మరియు పశ్చి మ గోదావరి లలో ఒక్కొ క్క రు చొప్పు న మరణిం చారు.

ap carona

క‌రోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14477 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1758 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 180 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2059311 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 33,050 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,09,28,798 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version