ఏపీలో కొత్తగా 248 కరోనా కేసులు నమోదు

-

ఏపీలో కరోనా మహమ్మారి కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బుల్లిటెన్ ప్రకరం … ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 248 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,72 , 446 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదు.

 

ఇక ఏపీ ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 14, 432 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2158 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 253 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 55 , 856 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 28, 509 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3 , 03 , 44 , 770 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏపీ లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version