జీవో నెం.1 తో ఏ కార్యక్రమాన్ని అడ్డుకోవట్లేదు – ఏపీ డీజీపీ

-

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్.1 పై విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలీసుల జిల్లా రివ్యూ మీటింగ్ కు హాజరయ్యారు డిజిపి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 గురించి ఎవరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

ఈ జీవోతో ఎవరి కార్యక్రమాలను అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇచ్చామన్నారు. ఎవరైనా పాదయాత్రలు చేయాలనుకుంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎక్కడ తమ్మి మీ బ్లాక్ చేయడం లేదన్నారు. జీవ వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ పార్టీల మీటింగులకు అనుమతులు ఇచ్చామన్నారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి సాగును అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version