దేవాలయాల భద్రత విషయంలో ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు

-

దేవాలయాల భద్రత విషయంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల దేవాలయాలకు సంబంధించిన వరుస  సంఘటనల దృష్ట్యా  రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలను  అప్రమత్తం చేశామని అన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద  నిరంతరం నిఘా, పెట్రోలింగ్ మరియు విజిబుల్ పోలీసింగ్ కు ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు.  దేవాలయాలు ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరిది, అర్చకులు పూజారులు ఆలయ నిర్వాహకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని తక్షణమే సమీపంలోని  పోలీసులకు లేదా డైల్ 100కు  సమాచారం ఇవ్వాలని పేర్కొన్న ఆయన ఎల్లవేళలా పోలీసుశాఖ అందుబాటులో ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని  అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రత చర్యలను పర్యవేక్షించాలని ఎస్పీలకు స్పష్ఠమైన ఆదేశాలిచ్చామని అన్నారు. ప్రతి ఒక్క  దేవాలయాలన్ని జియో ట్యాగింగ్ చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్దామని అన్నారు. మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్ర ప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version