ఏపీలో కొత్త కరోనా వైరస్ : ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషనర్ కీలక ప్రకటన

-

ఆంధ్ర ప్రదేశ్ లో  కరోనా కొత్త వైరస్ ఇంకా నిర్ధారణ కాలేదని ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు, ఆందోళనలకు గురికావొద్దని ఆయన పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం వరకు బ్రిటన్ నుంచి 1363 మంది  ఏపీకొచ్చారని ఆయన పేర్కొన్నారు. 1346 మంది ఆచూకీని కనుగొన్నాం, మరో 17 మంది వ్యక్తుల చిరునామా తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.

Ap government

ఇందులో 11 మందికి పాజిటివ్ గా నిర్ధారణైందని ఆయన అన్నారు. వీరి రక్త నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్, హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపామన్న ఆయన పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాతే కొత్త వైరస్సా..? లేదా అనేది నిర్ధారణవుతుందని అన్నారు. ఇప్పటివరకు 1324 మంది క్వారంటైన్ లో ఉన్నారని పరిచయస్తులైన 5,784 మందిని గుర్తించి.. వారి రక్త నమూనాలను పరీక్షలకు పంపామని అన్నారు. బ్రిటన్ నుంచి వచ్చే ప్రతివారూ వైద్య టెస్ట్ చేయించుకోవాల్సిందని అని ఆయన అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version