జీవో నెం.1పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

రోడ్‌ షోలు, ర్యాలీలు నిషేధిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 1ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఈనెల 23 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

నిబంధనలకు విరుద్ధంగా జీవో నం.1 ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version