మాగబెట్టిన మామిడి పండ్లు గుర్తించే ఈజీ మార్గాలు

-

వేసవి కాలం వచ్చేసింది! ఎండలతో పాటు అందరూ ఎంతో ఇష్టంగా ఎదురుచూసే మామిడి పండ్ల సీజన్ కూడా మొదలైపోయింది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా నోరూరించే మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. అయితే మనం కొనే పండ్లు చెట్టుపై సహజంగా పండినవా? లేక విషపూరిత కెమికల్స్‌తో మగ్గబెట్టినవా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆ కల్తీ పండ్లను గుర్తించే సింపుల్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

నిగనిగలాడే రంగు చూసి మోసపోకండి: సహజంగా పండిన మామిడి పండు మొత్తం ఒకే రంగులో ఉండదు. అక్కడక్కడా పసుపు, కొద్దిగా లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో ఉంటుంది. కానీ కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్ వాడిన పండ్లు చూడటానికి చాలా అందంగా, నిగనిగలాడుతూ అంతా ఒకే లేత పసుపు రంగులో మెరిసిపోతుంటాయి. ఈ తేడాను బట్టి మనం సులభంగా కనిపెట్టవచ్చు.

సువాసన మరియు స్పర్శతో తెలుసుకోండి: చెట్టుపై సహజంగా పండిన పండు నుంచి ఒక రకమైన తియ్యటి అద్భుతమైన సువాసన వస్తుంది. పండును ముట్టుకుని కొద్దిగా ఒత్తి చూస్తే కాస్త మెత్తగా తగులుతుంది. అదే రసాయనాలతో మగ్గబెట్టిన పండ్ల నుంచి ఎలాంటి సహజమైన వాసన రాదు. పైగా అవి పైకి పండులా కనిపించినా ముట్టుకుంటే గట్టిగా, తొక్క అస్సలు ముడతలు లేకుండా ఉంటుంది.

Are Your Mangoes Safe? Simple Ways to Spot Chemically Ripened Fruits
Are Your Mangoes Safe? Simple Ways to Spot Chemically Ripened Fruits

ఈ బకెట్ నీళ్ల పరీక్ష చాలా ఈజీ: మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పండ్లను ఒక బకెట్ నీళ్లలో వేసి చూడండి. సహజంగా పండిన పండ్లు బరువుగా ఉండి నీటిలో మునిగిపోతాయి. కానీ రసాయనాలతో బలవంతంగా మగ్గబెట్టిన పండ్లు లోపల సరిగ్గా పక్వానికి రావు. అందువల్ల అవి తేలికగా ఉండి నీటిపై తేలుతూ ఉంటాయి. కల్తీ పండ్లను పసిగట్టడానికి ఇది చాలా బెస్ట్ టెక్నిక్.

నాలుకపై మంట పుడుతోందా?: సహజంగా పండిన మామిడి పండు తింటే అమృతంలా నోరంతా తీపి రుచి తెలుస్తుంది. కానీ కెమికల్స్ వేసిన పండ్లు తిన్నప్పుడు నాలుకపై లైట్‌గా మంట పుట్టడం లేదా గొంతులో ఏదోలా అసౌకర్యంగా అనిపిస్తుంది. పైగా ఇవి పైకి పసుపు రంగులో ఉన్నా లోపల పచ్చిగా ఉండి, పుల్లటి రుచిని కలిగి ఉంటాయి.

వీటి వల్ల కలిగే అనారోగ్యాలు: కార్బైడ్ వేసిన పండ్లు తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. గొంతులో అల్సర్లు ఏర్పడే అవకాశం ఉంది. వీటి నుంచి వచ్చే గ్యాస్ వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో వీటిని తింటే శరీరంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రుచి కోసం ఆరాటపడి కెమికల్స్ వేసిన పండ్లను తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు. పండ్లు కొనేటప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండి, పైన చెప్పుకున్న చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మనం కల్తీ లేని స్వచ్ఛమైన మామిడి పండ్ల మధురమైన రుచిని ఆస్వాదించవచ్చు.

గమనిక: మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పండ్లను తినడానికి కనీసం ఒక అర గంట లేదా గంట ముందు మంచి నీళ్లలో వేసి ఉంచండి. దీనివల్ల వాటిపై ఉండే వేడి మరియు రసాయనాల ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news