ఇదేం మాయ కాదుగా..బిడ్డలను కనే మిషన్లు వచ్చేశాయి..

-

సోషల్ మీడియా ప్రభావం జనాల మీద ఏ విధంగా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి చిన్న విషయాన్ని ఇక్కడే చూస్తున్నారు.. కొన్ని మనుషుల బుర్రలకు పని పెదుతున్నాయి. నిత్యం ఏదొక వార్త వైరల్ అవుతూ వస్తుంది. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని అద్భుతంగా అనిపిస్తాయి. ఇంకొన్ని మైమరిపించేలా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అయితే ఇక్కడ వైరల్ అవుతున్నది చూస్తే మీకు ఆశ్చర్యంతో పాటు అద్భుతంగా అనిపించక మానదు.

 

తల్లి కావడం అనేది ఒక వరం.. ఆ అనుభూతి ఒక్క తల్లికి మాత్రమే తెలుసు. నవమాసాలు బిడ్డను మోసి కనడం మహిళలకు మాత్రమే దక్కిన ఓ అపూర్వమైన కానుక.శిశువుని 9 నెలల పాటు మోసి, భరించలేని నొప్పిని పంటి బిగువన భరించి బిడ్డకు జన్మనివ్వడం అనేది పూర్వజన్మ సుకృతం. అయితే బిడ్డకు జన్మనివ్వడం అనేది నేటి దైనందిత జీవితంలో జన్మనివ్వడం అనేది కొంతమందికి కష్టం అవుతోంది. దీనికి అనేక కారణాలు. ఈ క్రమంలోనే సరోగసి, IVF లాంటివి పుట్టుకొచ్చాయి.

 

ఇకపోతే ఇప్పుడు తల్లి గర్భం అవసరం లేకుండా పిల్లలను కనే మిషన్లు కూడా వచ్చాయి..పిల్లలను కనే మిషన్లా అని షాక్ అవ్వకండి మీరు విన్నది అక్షరాల వంద శాతం నిజం..ఇదేలా సాధ్యం..అవునా..ఇలాంటి సందెహాలు రావడం కామన్..ద్వారా బిడ్డకు జన్మనివ్వడం అనేది మానవుని మేధస్సుకి తార్కాణం. దీనిని ఎక్టో లైఫ్ అనే సంస్థ ఆర్టిఫిషియల్ యుటెరస్ ఫెసిలిటీని తీసుకువచ్చింది. ఇది ప్రపంచంలోనే తొలి కృత్రిమ పిండంలా పని చేస్తుందని సంస్థ చెబుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యంత్రాల సాయంతో ఈ యంత్రాల్లోనే 9 నెలలు పిండాన్ని పెంచి, శిశువు బయటకు వచ్చేంతవరకూ అన్నీ జాగ్రత్తగా చూస్తారు.ఇది విన్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.. ఇంక ముందు ఏమి వస్తాయో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version