బండి సంజయ్‌ ని అరెస్ట్‌ చేసిన పోలీసులే.. కేసీఆర్‌ ను జైళ్లో వేస్తారు : అస్సాం సీఎం

-

బండి సంజయ్‌ ని అరెస్ట్‌ చేసిన పోలీసులే.. 2023 లో సీఎం కేసీఆర్‌ ను అరెస్ట్‌ చేయడం ఖాయమని.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా అస్సాం సీఎం మాట్లాడుతూ… నాకు తెలుగు అర్థం కాకపోయినా బండి సంజయ్ మాట్లాడుతున్న సందర్భంగా 317 జీవో ఎంత ఇబ్బంది పెడుతుందో నాకర్థమైందని.. అస్సాంలో ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చే లాగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

కెసిఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మర్చిపోయాడు ఇప్పటివరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ సరిగా జరగడం లేదని ఫైర్‌ అయ్యారు. ఫామ్ హౌస్ లో కూర్చున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని.. నిజాం రాజుగా పాలనను గుర్తు చేసుకోకు అని ఫైర్‌ అయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పాలను గుర్తు చేసుకోని పాలన చేయని పేర్కొన్నారు. 2023 లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని స్పష్లంచేశారు. బీజేపీ కార్యకర్తల వెంట కేంద్ర నాయకత్వం ఉందని… ఎవ్వరికీ బయపడకండి… ప్రజల కోసము పోరాటం చేయండని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version