ఆ సమయంలో…మోడీ నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోయారా? : మల్లికార్జున్ ఖర్గే

-

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిన సమయంలో మోదీ నిద్రపోతున్నారంటూ మండిపడ్డారు. రాజస్థాన్‌లోని చిత్తోరగఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ… అవాస్తవాలు చెప్పేవారికి ప్రధాని నరేంద్ర మోడీ ఓ సర్దార్‌ అన్నారు. దేశం కోసం ఆయన ఆలోచించడం లేదని, కేవలం గాంధీ కుటుంబాన్ని దూషిస్తుంటారని ఆరోపించారు. ‘నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, నేను భయపడను’ అని ప్రధాని చెబుతుంటారని.. మరి భయం లేకపోతే భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొస్తున్న సమయంలో నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోయారా? అని ఆయన ప్రశ్నించారు.

దేశ ప్రజలను చిత్రహింసలకు గురిచేసి తన వెంట తీసుకెళ్లాలని మోడీ అనుకొంటున్నారన్నారు. 1989 నుంచి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని లేదా మంత్రులు కాలేదని ,అయినా సరే వారసత్వ రాజకీయాలంటూ మోదీ మాట్లాడుతుంటారని,గాంధీ కుటుంబసభ్యులు ఈ దేశం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version