ఇదేనా బీసీలకు స్వావలంబన కల్పించం అంటే? : అచ్చెన్నాయుడు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను, 672 మంది డైరెక్టర్లను నియమించింది. వీరు 2020 డిసెంబరు 17న పదవులు చేపట్టారు. వీరి రెండేళ్ల పదవీకాలం నేటితో ముగిసింది. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను ఉత్సవ విగ్రహాల్లా చేశారని మండిపడ్డారు. చైర్మన్లు ఒక్క పైసా ప్రయోజనం కల్పించకుండానే పదవీకాలం పూర్తిచేసుకున్నారని తెలిపారు అచ్చెన్నాయుడు. పదవి తీసుకున్నాక ప్రమాణ స్వీకారం… ఇప్పుడు పదవీ విరమణ తప్ప ఈ రెండేళ్ల కాలంలో వారు చేసిందేమీ లేదని పెదవి విరిచారు. బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించి సొంత కాళ్లపై నిలబడేలా చేసే కార్పొరేషన్లకు సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకుండా కాళ్లు విరిచేశాడని అచ్చెన్నాయుడు విమర్శించారు. 56 మందిని బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించిన జగన్ రెడ్డి… వారి కోసం ఎంత కేటాయించారో చెప్పగలరా? అని నిలదీశారు అచ్చెన్నాయుడు.

“బీసీలకు ఏంచేశారని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. లెక్కలు అడిగితే కేసులు పెట్టి జైల్లో వేయిస్తున్నారు. బీసీ సంక్షేమం అంటే ఇదేనా? ఇదేనా బీసీలకు స్వావలంబన కల్పించం అంటే? బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు చేయకపోగా, 2018-19లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 70 వేల రుణాలను రద్దు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిల్స్ వంటి పథకాలు రద్దు చేసి బీసీ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో బీసీ కార్పొరేషన్లకు ఏటా రూ.1200 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.6 వేల కోట్లు బడ్జెట్ ఖర్చు చేసింది. 4.20 లక్షల మంది యువతకు రూ.2 లక్షల చొప్పున స్వయం ఉపాధి రుణాలిచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేసింది. 70 వేల మందికి ఫెడరేషన్ల ద్వారా గ్రూప్ రుణాలిచ్చింది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version