ఏపీలో త్వరలోనే ఎన్నికలు..టీడీపీవే 160 సీట్లు : అచ్చెన్నాయుడు

-

టీడీపీ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని… ఎన్నికలెప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అచ్చెన్నాయుడు. 160 సీట్లతో నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వటం ఖాయమని.. తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాగానే అక్రమ కేసులన్నింటినీ ఒక్క సంతకంతో రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.

పేటీఎం బ్యాచ్ ను అడ్డంపెట్టుకుని గతంలో జగన్ టీడీపీపై విష ప్రచారం చేశారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీపీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబాన్ని కలిసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపు నిచ్చారు అచ్చెన్నాయుడు. ప్రజల కష్టాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఐటీడీపీ సభ్యులపై ఉందని ఆ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఐటీడీపీ సభ్యులపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని.. సమాజ చైతన్యం కోసం అంతా భయపడకుండా పోరాడాలని పిలుపు నిచ్చారు. ఏపీ అభివృద్ధి టీడీపీ పార్టీతోనే సాధ్యమని చెప్పారు అచ్చెన్నాయుడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version