మచిలీపట్నంలో దారుణం.. యాసిడ్ తాగిన చిన్నారి మృతి!

-

మచిలీపట్నంలో తీవ్ర విషాదం నెలకొంది. తాగు నీరు అనుకుని ఓ 18 నెలల చిన్నారి అనుకోకుండా యాసిడ్ తాగింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ విషాద ఘటన విజయవాడలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నం టెంపుల్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ అబ్బాస్‌ ఈ నెల 19న తన భార్య, ఇద్దరు పిల్లలు అయేషా, ఆఫియాలతో కలిసి మచిలీపట్నం నుంచి విజయవాడ అశోక్‌నగర్‌లోని అత్తారింటికి వచ్చాడు.

అయితే, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట మధ్య చిన్నారి అఫియా ఆడుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్లింది.బాత్ రూమ్‌లో ఉన్న యాసిడ్ బాటిల్‌ను చూసిన చిన్నారిమంచినీళ్లు అనుకుని మూత తెరిచి తాగేసింది. కొద్దిసేపటికే వాంతులు చేసుకోగా, గమనించిన తండ్రి వెంటనే చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్సపొందుతూ అఫియా ప్రాణాలు కోల్పోయింది.కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. దీనిపై విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version