యూపీలో దారుణం.. చాక్లెట్ ఆశ చూపి బాలిక పై అత్యాచారం

-

దేశంలో మాన‌వ మృగాలు రెచ్చిపోతున్నారు. త‌మ కోరిక తీర్చుకోవ‌డానికి ఏమీ తెలియ‌ని చిన్న చిన్న పిల్ల‌ల‌ను బలి చేస్తున్నారు. చిన్న పిల్ల‌ల‌కు చాక్లెట్ ఆశ చూపి దారుణానికి ఓడిగ‌డుతున్నారు. ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అమేతిలో చోటు చేసుకుంది. ఆమేతి గ్రామానికి చెందిన ఒక వ్య‌క్తి.. త‌న సోద‌రిల‌తో ఆడుకుంటున్న ఒక్క బాలిక‌కు రూ. 100 ఇచ్చి చాక్లెట్స్ తెచ్చుకోమ్మ‌ని చెప్పాడు. అలా మ‌చ్చిక చేసుకున్న ఆ కిర‌తాకుడు.. ఆ చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న స‌మ‌యంలో మ‌రోసారి చాక్లెట్స్ ఇస్తా అని న‌మ్మ‌బ‌లికాడు.

చాక్లెట్ త‌న గ‌దిలో ఉంద‌ని తీసుకెళ్లి దారుణానికి పాల్ప‌డ్డాడు. దీంతో బాలిక‌కు తీవ్ర రక్త స్రావం అయి పారిపోతుండ‌గా.. ప‌ట్టుకుని ఎవ‌రికీ చెప్ప‌వ‌ద్ద‌ని బెదిరించాడు. ఎవ‌రికైనా చెబితే చంపెస్తానంటూ భ‌యం చెప్పాడు. దీంతో హాడ‌లేత్తిపోయినా చిన్నారి.. ఇంట్లో ఎప్ప‌టిలాగేనా ఉంది. అయితే బాలికకు ఉన్న ర‌క్తం మ‌ర‌క‌ల‌ను చూసి.. జ‌రిగ‌నదానికి గురించి ఆరా తీశారు. అప్పుడు అసలు నిజం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో బాలిక కుటుంబ స‌భ్యులు.. అత‌నిపై ఫిర్యాదు చేయ‌డంతో నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి ఫోక్సో కేసు న‌మోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version